సీఎంగా కేసీఆర్‌‌‌‌ గిన్నిస్​బుక్‌‌ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం – విజయశాంతి

-

సిఎం కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంతమంది పీకేలు వచ్చినా ఏమీ చెయ్యలేరని… వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయం అన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ అమెరికాకు బిస్తరు సర్దే ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రతి గడ్డపైనా కాషాయ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే టీఆర్ఎస్‌‌కు భయమేస్తోందన్నారు.


కాంగ్రెస్‌‌లో ఎవరూ గెలవరు… గెలిచినా ఆ పార్టీలో ఉండరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. ‘పీకే టిఫిన్ ప్రగతిభవన్‌‌లో… లంచ్ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో చేస్తున్నరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని… రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవమని చురకలు అంటించారు. టీఆర్ఎస్‌‌ను ఎదుర్కునేది బీజేపీ ఒక్కటే. ఒకప్పుడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నదన్నారు.

ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉన్నం. త్వరలో రాష్ట్రాన్ని ఏలుతం. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని వెల్లడించారు. ప్రతి పైసా మోడీ గారు ఇస్తుంటే… అవి ప్రజలకు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఏడేండ్లలో సెక్రటేరియట్‌‌కు పోని సీఎంగా కేసీఆర్‌‌‌‌ గిన్నిస్​బుక్‌‌ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. బీజేపీకి భయపడే కేసీఆర్ పీకేని స్ట్రాటజిస్టుగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి ఎన్నికలకు వస్తున్నయి. ‘పేదోళ్లు ఆత్మబలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ పెద్దోడు రాజ్యమేలుతున్నడు. గరీబోళ్ల రాజ్యం కోసం బీజేపీ మలిదశ ఉద్యమం మొద‌లుపెట్టిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news