కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. కండువా కప్పిన ఖర్గే

-

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటీకి చేరారు. హైదరాబాద్లోని హోటల్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరు పై ఆమె ఆగ్రహం గానే ఉన్నారు.

తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. తాగావా ఆమె కాంగ్రెస్లో చేరారు. టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇన్చార్జి తాక్రే సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. టిఆర్ఎస్కు ప్రత్యామ్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కెసిఆర్ ను ఫామ్ హౌస్ కి పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news