BRSలో చేరిన విజయవాడ మాజీ మేయర్‌

-

బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పార్టీ కార్యకలాపాలు ముమ్మరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్​ పార్టీ త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల గురువారం రోజున బీఆర్​ఎస్​లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్‌గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్‌, టీడీపీల్లోనూ కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news