వికారాబాద్ బాలిక అత్యాచారం, హత్య… ప్రియుడే హంతకుడని తేల్చిన పోలీసులు

-

వికారాబాాద్ జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసును పోలీసులు దాదాపుగా చేధించారు. ప్రియుడే హంతకుడని పోలీసులు తేల్చారు. మరికొద్ది సేపట్లో  వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. ఈ ఘటనపై మొదటి నుంచి బాలిక ప్రియుడైన మహేందర్ అనే యువకుడిపైనే ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. సదరు యువకుడిని పోలీసులు విచారించారు. ఇదిలా ఉంటే బాలిక తల్లి పాత్ర కూడా హత్యలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉంటే పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించి, విచారించిన తర్వాత బాలిక ప్రియుడు మహేందరే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పూడూరు మండలవం అంగడి చిట్యంపల్లి ఉదయం పూట బహిర్భూమికి వెళ్లిన పదోతరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక ఊరు చివర్లో హత్యకు గురైంది. తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news