“వినరో భాగ్యము విష్ణు కథ” అంటూ వచ్చేసిన కిరణ్ అబ్బ వరం

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు ఈ మూవీ చేస్తూనే మరో మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో.

అయితే.. తాజాగా కిరణ్ అబ్బవరం మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టును అనౌన్స్‌ చేశారు. అంతేకాదు.. “వినరో భాగ్యము విష్ణు కథ” అనే టైటిల్‌ ను కూడా ప్రకటించేశారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా కు బన్నీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమా కు శరత్‌ చంద్ర నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా పోస్టర్‌ వదలడంతో.. కిరణ్‌ అబ్బవరం ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news