గెట్ వెల్ సూన్ చంద్రబాబు నాయుడు…!

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు అధికార పార్టీ నేతలు పదే పదే చేస్తూ ఉంటారు. ఆయన లక్ష్యంగా చాలా కామెంట్స్ వస్తు ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ లో కొంత మంది నేతలు తీవ్ర స్థాయిలో ఆయనను విమర్శిస్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే… ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్ ని రన్ చేస్తుంది.

హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా అలాగే మరి కొందరు ఎమ్మెల్యేలు గెట్ వెల్ సూన్ చంద్రబాబు నాయుడు అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని రన్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. ట్వీట్స్ చాలానే వస్తున్నాయి. దాదాపు అదే హ్యాష్ ట్యాగ్ తో 40 వేల ట్వీట్ లు చేసారంటే ఏ స్థాయిలో వైరల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఈ విధంగా టార్గెట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news