ఇండియాకు చేరుకున్న విరాట్ కోహ్లీ తనయుడు ‘అకాయ్’

-

క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇండియాకు చేరుకున్నారు. రెండో సంతానం కోసం లండన్ వెళ్లిన ఆమె ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ కి జన్మనిచ్చారు. సుమారు మూడు నెలలపాటు అక్కడే గడిపిన ఆమె ఇవాళ ముంబైకి చేరుకున్నారు. అనుష్క కుమారుడు అకాయ్ ని బేబీ క్యారీ బ్యాగ్లో ఎత్తుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లి నెల క్రితమే ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే.

కాగా, జనవరి 11, 2021న కోహ్లి-అనుష్క దంపతులకు తొలి సంతానంలో వామిక జన్మించింది.ఇకపోతే విరుష్క దంపతులు 2013 లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్న వారు ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news