విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ సెంటర్.. ప్రారంభించనున్న సీఎం జగన్‌

-

విశాఖలో నెలకొల్పిన ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏపీ సీఎం జగన్ అక్టోబరు 16న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖలోని మధురవాడ సిగ్నిటివ్ టవర్స్ వద్ద ఇన్ఫోసిస్ డేటా సెంటర్ ను నిర్మించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఇన్ఫోసిస్ అధికారులు మంత్రి అమర్నాథ్ తో సమావేశమయ్యారు. ప్రారంభోత్సవం విషయమై ఆయనతో చర్చించారు. విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రంలో తొలుత 650 మందితో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలోనే 1000 మందితో సేవలు అందించేలా విస్తరించనున్నారు. విశాఖ నుంచి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ అనుబంధ సేవలు, ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్స్ తదితర సేవలు అందించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది.

Will the dream to make Vizag a major IT hub come true?

ఈ ఇన్ఫోసిస్ కేంద్రం లో మొదట 650 మంది కార్యకలాపాలు సాగుతాయన్నారు. ఆ తర్వాత త్వరలోనే 1000 మందితో సేవలు కొనసాగుతాయన్నారు. విశాఖ నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ అనుబంధ సేవలు, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ వంటివే కాకుండా ఇతర సేవలు కూడా అందించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. త్వరలోనే విశాఖలో ఏపీ సినీ పరిశ్రమ కూడా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అలాగే మెట్రో సేవలు కూడా త్వరలోనే విశాఖలో అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news