వైసీపీ నేత హత్యకు కుట్ర.. విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

-

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు కుట్ర చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. వైసీపీ నేత చిరంజీవి హత్యకు సుపారి గ్యాంగ్ కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం వాళ్లు పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించారని నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్న గ్యాంగ్… ఇందుకోసం రూ. రూ. 4 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విశాఖలో సుపారి గ్యాంగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్న పోలీస్ అధికారులు వారిని విచారిస్తున్నారు. అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి మూడు కత్తులతో పాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ గ్యాంగ్ కు సుపారీ ఎవరు ఇచ్చారు? వాళ్లు ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎమ్మెల్యే చిరంజీవులకు ఎవరు శతృవులున్నారు? అది రాజకీయంగానా లేక వ్యక్తిగతంగానా? అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news