విద్య ద్వారానే దళితులు అభివృద్ధి : వివేక్‌ వెంకటస్వామి

-

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి నేడు హైదరాబాద్ చింతల్ బస్తిలోని వీర్ నగర్ లో కాక వెంకటస్వామి మెమోరియల్ హాల్ ని ఆవిష్కరించారు. 1977లో వెంకటస్వామిగా కేంద్రమంత్రిగా ఉన్నపుడు వాలీ బాల్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారని జ్ఞాపకం చేశారు వివేక్. ఇప్పుడు ఇదే ప్లేస్ లో కొత్త భవనం నిర్మించడానికి వెంకటస్వామి ఫౌండేషన్ తరపున ఫండ్స్ ఇచ్చామని పేర్కొన్నారు ఆయన. విద్యార్థులు చదువుకోవడానికి మంచి వాతావరణం క్రియేట్ చేయాలన్నారు. విద్య ద్వారానే దళితులు అభివృద్ధి చెందుతారని వివరించారు.

Ktr,Vivek Venkataswamy: రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు వచ్చిన మాట నిజమే..  వివేక్ క్లారిటీ - bjp leader vivek venkataswamy clarify on komatireddy  rajagopal reddy contracts - Samayam Telugu

5 వేల మందికి అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా విద్యను అందిస్తున్నామని చెప్పారు వివేక్. ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు మంచి ర్యాంకులు తెచ్చుకుని.. అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారని తెలిపారు ఆయన. స్టూడెంట్స్ కి స్కిల్ డెవలప్ మెంట్ కూడా నేర్పిస్తున్నామని అన్నారు. అక్కడ చదువుకున్న ప్రతీ విద్యార్థికి ఉద్యోగం వచ్చేలా తీర్చిదిద్దుతున్నామని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news