అభివృద్ధికి ఓటేస్తారా? విధ్వంసానికి వేస్తారా?: చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిల విమర్శలు గుప్పించారు.అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…’ఈ ఐదేళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు అని విమర్శించారు.

సంక్షేమానికి ఓటు వేస్తారా? సంక్షోభం సృష్టించిన వైసీపీకి వేస్తారా? వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు అని అన్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు’ అని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపు రేఖలు మారేవని ,మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని చంద్రబాబు అన్నారు.మూడు రాజధానులు అని మాట్లాడటానికి జగన్‌కు సిగ్గు, ఎగ్గు ఉందా అని ఆయన నిలదీశారు. రోడ్ల పై గుంతలు పూడ్చలేడు.. కానీ మూడు రాజధానులు అంటారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .

Read more RELATED
Recommended to you

Latest news