వినాయక్‌ ‘సీనయ్య’ ఇక లేనట్లేనా…!

-

వి.వి.వినాయక్‌ రెండు పడవల ప్రయాణానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తున్నాడు. ఏదో క్రేజీగా ఉంటుంది కదా అని కెమెరా ముందుకు వెళ్లిన వినాయక్‌కి, ఇది చాలా రిస్క్‌ అని తెలిసిపోయినట్లుంది. అందుకే మళ్లీ బ్యాక్‌కి వచ్చేస్తున్నాడు. సూపర్‌ స్టార్డమ్‌ తెచ్చిపెట్టిన డైరెక్షన్‌తోనే బిజీ కావాలనుకుంటున్నాడు మెగా మాస్‌ మేకర్.

వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో బ్రేక్‌ తీసుకుని యాక్టర్‌గా మారాడు. ‘ఇంటిలిజెంట్‌’ ఫ్లాప్‌తో కొంచెం స్లో ఫేజ్‌లో ఉన్న టైమ్‌లో ‘శీనయ్య’ అనే సినిమాతో కెమెరా ముందుకెళ్లాడు. దీంతో వినాయక్‌ మరో క్రేజీ కెరీర్‌ పాత్‌ చూజ్‌ చేసుకున్నాడనే కామెంట్స్‌ వినిపించాయి. కానీ వినాయక్‌ మాత్రం ‘శీనయ్య’తోనే యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. యాక్టింగ్‌ కంటే డైరెక్షన్‌ బెటర్‌ అనే ఇదిలోకి వచ్చాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

వి.వి.వినాయక్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘శీనయ్య’ సినిమా వస్తుందో రాదో తెలియదని కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్స్‌ రావడం ఆలస్యం వినాయక్‌కి యాక్టింగ్‌ అంటే పెద్దగా ఇంట్రెస్ట్‌ లేదని, అందుకే హీరోగా నటించిన ‘శీనయ్య’ రిలీజ్‌ గురించి ఇలాంటి కామెంట్స్‌ చేశాడని చెప్పుకుంటున్నారు సినీజనాలు.కొన్నాళ్లు యాక్టింగ్‌తో బిజీగా ఉన్న వినాయక్ మళ్లీ మెగాఫోన్‌ పడుతున్నాడు. చిరంజీవితో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడీ దర్శకుడు. మెగాస్టార్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకున్న మళయాళీ హిట్‌ ‘లూసిఫర్‌’ని రీమేక్ చెయ్యబోతున్నాడు

Read more RELATED
Recommended to you

Latest news