ఓటీటీ లోకి వచ్చేసిన వాల్తేరు వీరయ్య..!

-

ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ తో కొత్త ఏడాది కూడా ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఇప్పటికే థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ తో పాటు ఇప్పటిదాకా సినిమా చూడని వారంతా కూడా ఇప్పుడు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చేసి ప్రతి ఇంట్లో పూనకాలు లోడ్ చేస్తోంది ఈ సినిమా.

థియేటర్లలో వాల్తేరు వీరయ్య ఊచకోత నడుస్తుండగానే ఓటిటి లోకి కూడా వచ్చేసింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాడు వాల్తేరు వీరయ్య.. నిన్న రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మెగా మాస్ జాతర కోసం జనం కూడా రెడీ అవుతున్నారు. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సినిమాను ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు.

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్యతో రంగంలోకి దిగి భారీ సక్సెస్ అందుకున్నారు చిరంజీవి.. అన్ని ఏరియాలలో కూడా బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య జయభేరి మోగించింది . రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. చిరంజీవి కూడా 2.5 మిలియన్ డాలర్ల కొల్లగొట్టి రికార్డులను బ్రేక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news