ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్… విచారణకు ఆదేశించిన హరీష్ రావు

-

వరంగల్ ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ పెషెంట్ ను ఎలుకలు కొరుక్కుతినడం సంచలనంగా మారింది. అనారోగ్యంలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తి చేతులు, కాళ్లు, అవయవాలను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. రెండు రోజులుగా వైద్యులు చికిత్స చేస్తున్నా… ఈవిషయాన్ని గుర్తించలేదు. గాయాల నుంచి రక్తం కారడం చూసిన బంధువులు వైద్యులకు విషయాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులు సంబంధిత సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై స్పందించిన మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనపై వైద్యులను, బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ. ఎంజీఎం సూపరిండెంట్ శ్రీనివాస్ రావు కూడా విచారణకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news