షాకింగ్.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు వార్న‌ర్ దూరం!

-

మ‌రి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కాబోతున్న స‌మ‌యంలో వార్న‌ర్ అభిమానుల‌కు షాకింగ్ అందుతుంది. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే టాటా ఐపీఎల్ తొలి మ్యాచ్ ల‌కు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ దూరంగా ఉండ‌నున్నార‌ని తెలుస్తుంది. గ‌త ఏడాది వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన రిటెన్షన్ ప్ర‌క్రియాలో స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం వార్న‌ర్ వ‌దిలేసింది. దీంతో వార్నర్ మెగా వేలానికి అందుబాటులో ఉన్నాడు. దీంతో వార్న‌ర్ ను ద‌క్కించుకోవ‌డానికి ఫ్రొంచైజీలు ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి.

అయితే వార్న‌ర్ ఏ జ‌ట్టుకు ఆడినా.. అత‌న్ని అభిమానించే వాళ్లు చాలానే ఉంటారు. వార్న‌ర్ ఆట‌ను చూడ‌టానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ల‌కు వార్న‌ర్ దూరంగా ఉంటున్నాడ‌ని స‌మాచారం. వార్న‌ర్ తో పాటు పాట్ క‌మిన్స్, స్టీవ్ స్మిత్,అన్రిచ్ నోర్జే, మార్కో జాన్స‌న్, క‌గిసో ర‌బాడా కూడా ఈ ఐపీఎల్ ప్రార‌భం మ్యాచ్ ల‌కు దూరంగా ఉండ‌నున్నారని తెలుస్తుంది.

కాగ ఐపీఎల్ ప్రారంభం అయ్యే స‌మ‌యంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ‌ధ్య సిరీస్ ఉండ‌నుంది. అలాగే సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ మ‌ధ్య కూడా సిరీస్ ఉండ‌నుంది. దీంతో ఈ నాలుగు దేశాల ఆట‌గాళ్లు ప‌లువురు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ల‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news