బాబుని టార్గెట్ చేస్తున్న టీ.బీజేపీ..కేసీఆర్‌-రేవంత్‌కు చెక్?

-

టీడీపీ అధినేత చంద్రబాబు…బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తుంటే..బీజేపీ మాత్రం బాబుని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. పాపం ఏ సంబంధం లేని విషయంలో కూడా బాబుని లాగి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పోనీ ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారంటే అర్ధం ఉంది..కానీ తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. అయితే చంద్రబాబుని టార్గెట్ చేసి పరోక్షంగా కేసీఆర్-రేవంత్ రెడ్డిలకు చెక్ పెట్టాలని బీజేపీ చూస్తున్నట్లు కనిపిస్తోంది.

 ఇటీవల సీఎం కేసీఆర్…కేందంపై పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే…అయితే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు సైతం ఇలాగే బీజేపీపై పోరాటం చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు…అప్పుడు ఆ చంద్రం…ఇప్పుడు ఈ చంద్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరే ఇదిలా ఉంటే తాజాగా మోదీ పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ విభజనపై మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్ విభజన సరిగ్గా చేయలేదని అన్నారు. ఇక ఈ మాటలపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు…అదిగో మోదీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ప్రధాని వ్యాఖ్యలని ఖండించారు.

అయితే కేటీఆర్, రేవంత్‌లకు బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతలకు అర్థం అయినట్టు లేదని, మోదీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ఫైర్ అయ్యారు.  టీఆర్‌ఎస్‌ తమ మనుగడ కోసం బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని, అలాగే ప్రధానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర విభజన తీరుపై మోదీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే గతంలో తెలంగాణ ఏర్పాటుని చంద్రబాబు అడ్డుకున్నారని, ఆ చంద్రబాబే…రేవంత్ రెడ్డిని పెంచి పోషించారని చెప్పి కామెంట్ చేశారు. అంటే చంద్రబాబుని టార్గెట్ చేసి పరోక్షంగా టీఆర్ఎస్, రేవంత్‌లని బీజేపీ ఇరుకున పెట్టాలని చూస్తున్నాట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news