ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: చంద్రబాబు

-

ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, అయితే.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారి కుట్రలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్నం చేశాయని అన్నారు. వైసీపీ హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని, తాము దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదని బాబు అన్నారు.

కాగా, 2024 లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఈ రోజు(మే 13) మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది.ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news