నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించాము : సీఎం చంద్రబాబు

-

రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్‌ సెన్సస్‌. గ్లోబల్‌ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తాం అని అన్నారు. తయారీ రంగానికి ఆంధ్ర ప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతం. విశాఖను ఫిన్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని తెలిపారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఫార్మా, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి” అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news