రిమోట్ ఓటింగ్ మిషన్ ఆలోచనను స్వాగతిస్తున్నాం – పయ్యావుల కేశవ్

-

“రిమోట్ ఓటింగ్ మెషీన్‌” ఆలోచనను సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నాం అన్నారు తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన విధానాన్ని తప్పుబడుతున్నామన్నారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే “ఆర్వీఎం” ప్రతిపాదనను తీసుకొచ్చారని ఆరోపించారు. విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం తర్వాతనే ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు.

నేరుగా “డెమో” ఏర్పాటు చేశాం రావాలని అన్ని పార్టీలను ఈసీ ఆహ్వానించిందని.. “డెమో” కంటే ముందు పార్టీలన్నీ తమ అభిప్రాయం వినాలని పట్టుబట్టాయన్నారు. లిఖితపూర్వకంగా పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పడం కోసం పెట్టిన జనవరి 31 డెడ్‍‌లైన్ కూడా పొడిగించే అవకాశాలున్నాయన్నారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదన్నదే తమ విధానమని ఈసీ చెబుతోందని.. ఆ విధానానికి మేము కూడా అనుకూలమే అయినప్పటికీ అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సగటున 30 శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారని, వారిలో వలసపోయినవారే అధికమని ఈసీ చెబుతోందన్నారు. దీనిపై శాస్త్రీయమైన అధ్యయనం ఏదైనా జరిగిందా అని టీడీపీ ప్రశ్నిస్తోందన్నారు. మేము గమనించినంత వరకు వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని అన్నారు. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news