ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం : కేసీఆర్

-

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉంది. మోసపూరిత హామీలు నమ్మి జనం కాంగ్రెస్‌కు ఓటేశారు. గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానని మోడీ అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు.

తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో వచ్చినా, షెడ్యూల్ ప్రకారం.. వచ్చినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపారు. తనను నమ్మండని చెప్పారు. తెలంగాణలో ఇంకా చాలా మంచి జరగాల్సి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ చెప్పిన పథకాలే అన్నారు. తమకంటే ఎక్కువ లబ్ధి ఇస్తామన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని ఎన్నికల ప్రచార వేదికగా వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news