రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు.తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెడనలో జరుగుతున్న రోడ్ షోలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారం కోసం జగన్ ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు అని విమర్శించారు. ‘జగన్ మళ్లీ మరో నాటకం ఆడుతున్నారు. గులక రాయి అంటూ డ్రామాలాడుతున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి’ అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news