కెసిఆర్ అవినీతిని బట్టబయలు చేస్తాం – ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణ ప్రజలకు అండగా ఉండి, కెసిఆర్ అవినీతిని బట్టబయలు చేస్తానన్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ఒక రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతాను అన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను పార్టీ గుర్తించి రాజ్యసభ సభ్యుడిని చేస్తే కెసిఆర్ ఎందుకు అంత ఆందోళనకు గురి అవుతున్నాడు అని అన్నారు.

ప్రజల నుండి వచ్చిన నేను, ప్రజల కోసం పని చేస్తాను తప్పా.. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని తండ్రి చాటు బిడ్డగా అమెరికా నుండి వచ్చిన వ్యక్తిని కాదని చురకలంటించారు. ప్రజలు కెసిఆర్ పాలన పట్ల విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని అన్నారు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news