వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తాం – మంత్రి కేటీఆర్

-

రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వీఆర్ఏలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు మరోసారి వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని కారణాలవల్ల వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు ఆలస్యం అవుతుంది తప్ప.. వేరే ఉద్దేశం ఏదీ లేదని కేటీఆర్ తెలిపారు.

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని ఆ సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేరువేరు కాదని పేర్కొన్నారు. ఆవేశాలకు పోగుంట వెంటనే ఆందోళనలు విరమించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news