ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం: మోదీ

-

లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్(ట్విట్టర్) లో స్పందించారు. ‘ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.ఈ విజయం కోసం ఎంతో కృషి చేసిన కార్యకర్తలందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. వారిని అభినందించేందుకు మాటలు చాలవు’ అని మోదీ పేర్కొన్నారు.

అంతేకాకుండా…ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు అసాధారణమైన విజయాన్ని అందించారని, వారు అందించిన ఆశీసులకు ధన్యవాదాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news