బ్రేకింగ్ : ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ ప్రెసిడెంట్‌..!

-

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ కి చెందిన బీజేపీ నేత పూర్ణచంద్ర దాస్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి ఆయన చెట్టుకు ఉరివేసుకొని మరణించినట్లు స్థానికులు గుర్తించారు. ఐతే ఇది ఆత్మహత్య కాదని.. రాజకీయ హత్య అని వారు ఆరోపిస్తున్నారు. ఆయనని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. కాగా బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొట్టివేశారు.

ఈ ఆత్మహత్య ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పూర్ణచంద్ర దాస్ దిఘా పట్టణంలోని రాంనగర్2 మున్సిపాలిటీలో 41వ వార్డుకు బూత్ ప్రెసిడెంట్‌ గా పనిచేస్తున్నారు. కాగా, ఇంతకు ముందు నార్త్ దినాజ్‌పూర్ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ కూడా ఇదే తరహాలో అనుమాస్పద స్థితిలో మరణించారు. ఆయన నివాసం సమీపంలోనే మృతదేహం వేలాడుతూ కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news