ఇదెక్కడి వింత !.. గుంటూరు కారం నుంచి కొత్త సాంగ్ విడుదల..?

-

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించ లేక పోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. బహుశా టాలీవుడ్ లో ఇలా మూవీ విడుదల అయిన అనంతరం పాట రిలీజ్ కావడం ఇదే మొదటిది కావచ్చు. ఈ శుక్రవారం గుంటూరు కారం ఏడో లిరికల్ సాంగ్ వస్తుంది అంటూ స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఈ పాట తనకు, మహేష్ బాబుకు ది బెస్ట్ సాంగ్ అని అన్నారు. అంతా అయిపోయిన తర్వాత లిరికల్ సాంగ్ ఏంట్రా బాబూ అనే కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా, రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news