కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?: సీతక్క

-

హైదరాబాద్ నడిబొడ్డున మైనార్టీ బాలికపై అధికారపార్టీ, వారి ఫ్రెండ్లీ పార్టీ నేతలు అత్యాచారం చేస్తే కనీసం ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. సమాజంలో ఎంతో మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మన బట్టల గురించో, వేసుకునే నగల గురించో, కూరగాయల గురించో, గంటలు గంటలు చర్చించుకునే మనం.. ఈరోజు మన పిల్లల పైనో, మన పక్కింటి పిల్లల పైనో ఘోరాలు జరుగుతుంటే మనము ఏమీ మాట్లాడడం లేదని అన్నారు.

చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇలాంటి పరిస్థితిలో ప్రతి మహిళా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం ఆసన్నమైందని చెప్పారు.” మహిళల్లారా బయటకు రండి.. మనల్ని మనం రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. దొంగలను, దోషులను, నిందితులను రక్షిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని అన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news