ఆ తప్పుల వల్లే కృతి శెట్టి ఇండస్ట్రీకి దూరం కానుందా..?

-

కృతి శెట్టి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు యాడ్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగులో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో మెగా మేనల్లుడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో కృతి శెట్టి పేరు తెలుగు రాష్ట్రాలలో బాగా మారుమ్రోగి పోయింది. ఆ తర్వాత వచ్చిన నాగచైతన్యతో బంగార్రాజు, నాచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

మొదట్లోనే మంచి విజయాలను అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగు వేసింది. రామ్ పోతినేని సరసన దివారియర్ సినిమాలో నటించి డిజాస్టర్ ను మూటకట్టుకున్న ఈమె ఆ తర్వాత నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బెడిసి కొట్టడంతో.. ఇకనైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుందని అందరూ ఊహించారు. కానీ ఆమె ఏ మాత్రం కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోకపోగా పైగా మళ్లీ డిజాస్టర్ కథనే ఎంచుకుంది. అలా సుదీర్ బాబు హీరోగా వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో.. కంటెంట్ పెద్దగా లేని కథను ఎంచుకొని మరొకసారి బోల్తా కొట్టింది.

వరుసగా హ్యాట్రిక్ ప్లాఫ్ లను చవిచూసినప్పటికీ కథల ఎంపిక విషయంలో ఈమె జాగ్రత్త వహించకపోవడం వల్లే ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కనీసం ఇకనైనా తేరుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడితే తప్ప తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అన్నట్లుగా మారిపోయింది. మరి ఇకనైనా ఆమె కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుందో లేదో ఆమె తదుపరిచిత్రం విజయవంతం అయ్యేవరకు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news