రంభ మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనుందా?

-

ఒకప్పటి అగ్రనాయకులు అందరి సరసన కథానాయికగా నటించి మెప్పించిన రంభ..తాజాగా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈవీవీ సత్యనారాయణ” ఆ ఒక్కటి అడక్కు” చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది రంభ.తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి.ఆ తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బోజ్పూరి, బెంగాలీ చిత్రాల్లో సైతం నటించి సత్తా చాటుకుంది.12 ఏళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ మెన్ ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితానికి అంకితమై పోయింది.ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు.

 

ఆ మధ్యలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.ఈ క్రమంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ తమిళ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది.కార్తీ హీరో గా నటిస్తున్న ” సర్దార్” చిత్రంలో రంభ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఇరుంబు తిరై తెలుగులో” అభిమన్యుడు” హీరో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు పీయన్ మిత్రన్ ” సర్దార్ ” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సినిమా తో పాటు..మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news