రైతు బజార్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

-

కొత్తపేటలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతానని మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబిత ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.ఈరోజు కొత్తపేటలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతు బజార్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్ నర్సింహా గౌడ్ తో కలిసి పరిశీలించారు.

 

రైతు బజార్ లోని వ్యాపారాస్తులు, వినియోగదారులు, రైతుల సమస్యలను ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి చిలుక నర్సింహా రెడ్డి, డీఈ రవీందర్,రైతు బజార్ కార్యదర్శి స్రవంతి రెడ్డి,స్వరూప రెడ్డి, మహమ్మద్ ఖాన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, రైతు బజార్ సిబ్బంది, రైతులు, వ్యాపారాలు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news