రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తా: సీఎం వైఎస్ జగన్

-

తాజాగా రాబోయే లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.ఈ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది.

‘రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్లేలా అడుగులు వేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ట్వీట్లో తెలిపింది.ఇదిలా ఉంటే… సీఎం జగన్ పులివెందుల నుంచి తిరిగి బరిలోకి దిగుతున్నారు.కాగా, ఇటీవలి తొలి జాబితాను పొత్తులో భాగంగా టీడీపీ , జనసేన, బీజేపి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news