ఆచార్య దెబ్బతో..గాడ్ ఫాదర్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న చిరు..!!

-

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అందుచేతనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కు సంబంధించి పలు అప్డేట్లను కూడా ప్రకటిస్తూ ఉంది చిత్రం. అయితే ఇలాంటివి ఎన్ని చేస్తున్నా కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో బజ్ రావడం లేదన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. అలాగే నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం.

అయినప్పటికీ ఈ చిత్రానికి మాత్రం అంతగా బజ్ క్రియేట్ కాలేకపోతోంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్ మరియు ఇతర ప్రమోషన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి కలిగించే అంశాలు అంతగా లేకపోవడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. ఇక వీటితో పాటే చిత్ర బృందం ఈ సినిమా థియేట్రికల్ డీల్ కూడా క్లోజ్ చేయలేకపోతున్నారనే వార్త వినిపిస్తున్నది. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా అంటే కొన్ని నెలల ముందు నుంచే బిజినెస్ డీల్ జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా క్రేజీ కాంబినేషన్ ను బట్టి కూడా ఆ సినిమాకు అత్యధికంగా రేటుకు అమ్ముడుపోతూ ఉంటుంది. కానీ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా డీల్ క్లోజ్ కాకపోవడంతో అభిమానులు సైతం కాస్త ఆశ్చర్యపోతున్నారు అయితే అందుకు కారణం కూడా ఆచార్య ఫలితమే అన్నట్లుగా సమాచారం.

ఆచార్య సినిమాతో బయ్యర్లు చాలా నష్టపోవడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లు సైతం సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లైతేనే సినిమాను తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాని ఓన్ గానే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య దెబ్బతో గాడ్ ఫాదర్ సినిమా పరిస్థితి ఇలా మారిపోయిందని చెప్పవచ్చు.నిర్మాతగా కొణిదెల బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news