దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.

హైదరాబాద్‌, నెల్లూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. 25 బృందాలుగా ఏర్పడిన అధికారులు హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌లో రెండుసార్లు సోదాలు నిర్వహించారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

మరోవైపు బెంగళూరు, చెన్నైలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వెళ్లి అన్నిచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 40కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news