దుబాయ్‌ కంపెనీతో రూ. 100 కోట్ల బిజినెస్ చేస్తున్న నయన తార !

-

స్టార్‌ హీరోయిన్‌ నయన తారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిల్‌, తెలుగు రెండింటా మంచి క్రేజ్‌ తెచ్చుకుంది నయన తార. అయితే.. నయన తార, ఆమె బాయ్ ఫ్రెండ్‌ విఘ్నేష్‌ శివన్‌ విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని ప్రస్తుతం ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కెరీర్‌ పరంగా ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో.. కథువాకుల రెండు కాదల్‌ అనే మల్టీ స్టారర్‌ సినిమా చేస్తుంది నయన తార. ఇందులో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే… నమయతార, విఘ్నేష్‌ శివన్‌ దుబాయ్‌ కి చెందిన ఆయిల్‌ కంపెనీలో ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కోలీవుడ్‌ లో కూడా దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయని టాక్‌ అయితే… దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news