పళ్ల పొడి అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది.. ప్రాణాలు కోల్పోయింది!

-

పళ్లపొడి అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లాలోని నాదెండ్ల ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఎలుకల మందుతో పళ్లు తోముకొని ప్రాణాలను కోల్పోయింది. ఈనెల 7 నే ఈ ఘటన జరగగా.. బాధితురాలు చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది.

27 ఏళ్ల మరియమ్మ అనే మహిళ ఎలుకల మందుతో పళ్లు తోముకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ ఇవాళ మృతి చెందింది. అయితే.. మరియమ్మకు కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేదట. మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఎలుకల మందుతో పళ్లు తోముకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news