దుబ్బాక బిజెపి అభ్యర్ధి నన్ను మోసం చేసారు: రోడ్డెక్కిన మహిళ

-

దుబ్బాకలో బిజెపి పోటీ చేయడం ఏమో గాని పార్టీ అభ్యర్ధికి మాత్రం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆయన డబ్బులు పంచడానికి చూస్తున్నారు అనే ఫిర్యాదు వచ్చింది. ఇక తాజాగా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తనను మోసం చేశాడని ఆరోపణలు చేసారు రాధా రమణి అనే మహిళ. ఆమె మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేసారు.

రఘునందన్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని ఉప ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ రఘునందన్ రావు చేసిన దారుణాల పై మహిళలకు వివరిస్తాను అని ఆమె ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అబ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు ఓటమికి కృషి చేస్తా అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news