ప్రేమించి పెళ్లాడింది…మరణించింది..!

-

మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనిలో నివసిస్తున్న సాయి చరణ్, సమీనా భాను దంపతులు 2016  సంవత్సరంలో  పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఉన్నట్టుండి ఏమి జరిగిందో తెలియదు కానీ గతకొన్ని రోజులుగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, రెండురోజుల క్రితం సమీనా భాను ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది. అయితే భర్త వేదింపులే దీనికి కారణమని అతనిని కఠినంగా శిక్షించాలని  సమీనా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పి.వో. డబ్ల్యూ సంధ్య ఆధ్వర్యంలో మృతురాలి బంధువులు మల్కాజిగిరి పోలీసులను కలిసి మృతురాలు సమీనా భాను కేసులో వేగంగా దర్యాప్తు చేసి ఆమె భర్త సాయి చరణ్ తో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news