WORLD CUP 2023:న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్… ఫైనల్ కు ఇండియా పక్కా!

-

ముంబై లో ఇండియా క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడి ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు అభేద్యమైన టార్గెట్ ను ఉంచింది. ఇండియా నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది, కేవమా మూడు పరుగుల దూరంలో 400 మార్క్ ను చేరుకోవడంలో నిలిచిపోయింది. ఇండియాలో కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (105), గిల్ (79) లు రాణించారు. కింగ్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్ ద్వారా చాలా రికార్డ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వన్ డే లలో అత్యధిక సెంచరీ ల రికార్డును అధిగమించి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ ముందు ఉంచిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందా అంటే సందేహమే అని చెప్పాలి.

ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో ఇండియా బౌలింగ్ ఏ విధంగా ఉందంటే, ప్రత్యర్ధులు అందరినీ ఆల్ అవుట్ చేస్తూ బెస్ట్ బౌలింగ్ అటాక్ గా పేరు తెచ్చుకుంది. మరి న్యూజిలాండ్ ను ఓడించి ఇండియా ఫైనల్ కు చేరుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news