క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న రెజ్లర్‌ భజరంగ్‌ పునియా

-

టోక్యో ఒలింపిక్స్‌ లో ఇండియా రెజ్లర్‌ భజరంగ్‌ పునియా తన హవాను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరో విజయం తో ఏకంగా టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ కు చేరుకున్నాడు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా. 65 కిలోల విభాగంలో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌ లో కజక్‌ స్థాన్‌ కు చెందిన ఆక్మత్‌ అలీని 3-3 తేడాతో ఓడించాడు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా. వీరిద్దరి మధ్య పోరు ఫైనల్‌ ను తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.

కానీ అద్భుతమైన డిఫెన్స్‌ తో ఆకట్టుకున్నాడు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా. ఫస్ట్‌ రౌండ్‌ భజరంగ్‌ పునియా టచ్‌ డౌన్‌ ద్వారా 1 పాయింట్‌ అందుకున్నాడు. మరో సారి ప్రత్యర్థిని రింగు బయటకు పంపించి 2 పాయింట్లు సంపాదించి 3-0 తో ఆధిక్యంలో వెళ్లాడు భజరంగ్‌ పునియా. ఇక చివరల్లో ఒక దఫాలో భజరంగ్‌ పునియా ఒకేసారి 2 పాయింట్లు సాధించి.. విజయ కేతనం ఎగురవేశాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో అతడు ఇరాన్‌ కు చెందిన గియాసి చెకాతో తలపడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news