తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..ఎస్సై ఉద్యోగాలకు అగస్ట్ 7న రాత పరీక్ష

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. ఎస్సై ఉద్యోగాలకు రాత పరీక్ష పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. ఎస్సై ఉద్యోగాలకు అగస్ట్ 7న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. ఉదయం 10 గం.లనుండి 1గం.ల వరకు ఎగ్జామ్ నిర్వహిచనున్నట్లు స్పష్టం చేసింది.

మొత్తం 554 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయని…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. ఇక 554 ఎస్సై ఉద్యోగాల కోసం ఏకంగా 2 లక్షల 47 వేల 217 మంది అభ్యర్ధులు అప్లై చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక ఈ నెల 30 వ తేదీ నుండి ఆగస్ట్ 5 వ తుదీ వరకు హాల్ టికెట్ల పంపిణీ జరుగుందని తెలిపింది. నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ అని స్పష్టం చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.

Read more RELATED
Recommended to you

Latest news