WTC FINAL 2023: కీలక సమయంలో ఆపద్బాంధవుల్లా ఇండియాను ఆదుకున్న రహానే & శార్ధూల్ …

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఇండియా ఈపాటికే ఆల్ పౌట్ అయి ఉండేది. కానీ టీం మొత్తం మీద ఇద్దరే ఇండియాను దాదాపు ఘోర ఓటమై నుండి రక్షించారు. ఇండియా ఇనింగ్స్ అస్సలు ఆరంభం నుండి సరిగా సాగలేదు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో రహానే మరియు జడేజాలు కలిసి అయిదవ వికెట్ కు 71 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆతర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇండియా 200 పరుగులు అయినా చేస్తుందా అనుకున్నారు. కానీ అజింక్య రహానే తన అనుభవంతో శార్దూల్ ఠాకూర్ సహాయంతో టీం ను గట్టెక్కించారు. వీరిద్దరూ ఎదవ వికెట్ కు ప్రస్తుతానికి 108 పరుగులు చేసి క్రీజులో ఆడుతున్నారు.

అజింక్య రహానే 89 పరుగులతో ఉండగా , శార్ధూల్ మాత్రం 36 పరుగులతో ఉన్నాడు. వీరిద్దరూ ఇదే విధంగా ఆడితే ఇండియా ఈజీ గా ఆస్ట్రేలియా ముందు కొంచెం అయినా లీడ్ స్కోర్ ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news