ఆ భయం జగన్ ను వెంటాడుతోంది !

-

ఏపీ సీఎం జగన్ మీద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని అన్నారు. భస్మాసురుడిలా తన చెయ్యి తననెత్తిపై తానే జగన్ రెడ్డి పెట్టుకున్నాడని ఆయన అన్నారు. శిక్షపడితే 6ఏళ్ల అనర్హత భయం జగన్ ను వెంటాడుతోందని యనమల పేర్కొన్నారు. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి అనర్హుడు అవుతాడన్న ఆయన ఈ 31 కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనే భయం జగన్ లో ఉందని యనమల అన్నారు.

అందుకే తప్పుల మీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. సిజెకు లేఖలో జగన్ ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ప్రతిబింబించాయని, అందుకే న్యాయవాదుల సంఘాలన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండా బైటపెట్టాయని అన్నారు. జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే అవరోధాలని ఆయన అన్నారు. సిజెకు లేఖ ద్వారా జగన్ రెడ్డి సాధించింది ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news