విజయసాయి ఫ్యూచర్ సిఎం అంటూ ట్వీట్స్….!

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీలో ఇప్పుడు కుదుపు మొదలైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో కాస్త ముందు నుంచి కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఆయన సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని చేసే విమర్శలు వైసీపీ అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. ఇక ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండటమే కాకుండా సిఎం వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహిత వ్యక్తి…

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న కాస్త హడావుడి ఆయనకు ఇబ్బందిగా మారింది. విజయసాయి రెడ్డి ఫ్యూచర్ సిఎం అంటూ వాళ్ళు పోస్ట్ లు చేస్తున్నారు. అలాగే విజయసాయి రెడ్డి ఆర్మీ అనేది కూడా ఒకటి తయారు అయింది. వీళ్ళు అందరూ కూడా విజయ సాయి ని కీర్తించే కార్యక్రమం చేస్తున్నారు. వైసీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఆయన ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది అని. కాని ఇక్కడ కొంత మంది ఏమంటున్నారు అంటే ఆయన తన సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు అని…

తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి వ్యాఖ్యలు చేసే టీడీపీ నేతలు కొందరు ఈ వ్యవహారంపై ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన బిజెపి కి అనుకూలంగా మారి జగన్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని సిఎం జగన్ జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫ్యూచర్ సిఎం అనే వ్యాఖ్య చేయకుండా ఆయన అభిమానులు ప్రచారం చేసుకోవచ్చు అని ఇలాంటివి పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news