వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ దోస్తీ!

-

తిరుపతి మాజీ ఎంపీ ఆసక్తికరనమైన వ్యాఖ్యలు

గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో విరిద్ధరి మధ్య దోస్తీ అంటూ వైసీపీ మాజీ ఎంపి ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం…ఆ తర్వాత పవన్ తనదైన శైలిలో స్పందించిన విషయాలు తెలిసినవే.. నాటి నుంచి సామాజిక మాధ్యమాలు, మీడియా వేదికగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పర విమర్శలు చేసుకోవడం జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ .. రానున్న ఎన్నికల్లో వైసీపీ, జనసేన పార్టీలు త్వరలోనే ఒక్కటవుతాయని ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆయన ప్రటించడంతో పాటు, పవన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

జగన్ లాంటి నేతకు పవన్ తోడైతే.. ప్రజా క్షేత్రంలో చంద్రబాబు ద్రోహిగా నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సారి కూడా తిరుపతి నుంచే తాను బరిలోకి దిగనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. వరప్రసాద్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news