కృష్ణానదిలో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు మృతి

-

గుంటూరు జిల్లా గుండిమెడ వద్ద గల కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. నేడు సెలవు కావడంతో మొత్తం ఏడుగురు మిత్రులు కృష్ణానదిని చూసేందుకు  వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈతకెళ్లిన విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో నదిలో గాలించిన ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ సిబ్బంది.. నీలం శశి (8), దినేశ్ (8), శివ(14), క్రాంతి కుమార్ (10)ల మృతదేహాలను బయటకు తెచ్చారు. మరణించిన విద్యార్థులంతా చిర్రావూరు గ్రామానికి చెందిన వారుకాగా వారంతా ఒకే పాఠశాలకు చెందిన వారు.

బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ

గుంటూరు ఎంపీ గల్లా జయదేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల కుటంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరుఫున సాయం అందిస్తామని హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news