సెల్ ఫోన్ దొంగతనం చేసాడని ఇష్టం వచ్చినట్టు కొట్టిన వైసీపీ నేత…!

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ నేతలు వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ప్రధానంగా దళితులపై దాడుల విషయంలో వైసీపీ నేతల పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. తాజాగా ఒక వైసీపీ నేత పేరు మరోసారి బయటకు వచ్చింది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామం లో దళితులపై దాడి జరిగింది. సెల్ ఫోన్ దొంగలించారంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన ఇంద్ర, చంద్రశేఖర్, నాగేంద్ర లను విచక్షణా రహితంగా వైసీపీ నేత ఒకరు కొట్టారు.

ఆయన స్థానిక గ్రామ వైసీపీ నేత ప్రసాద రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునే విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడిని నిరసిస్తూ రోడ్డుపై గ్రామస్తులతో దళితులు బైఠాయించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని… ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news