ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు డైపర్లు వాడండి – సోమిరెడ్డి

-

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వీరి భేటీ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీతో వైసిపి నేతల ప్యాంట్లు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు డైపర్లు వాడాలని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే వీరు భేటీ అయ్యారని తెలిపారు. వీరిద్దరూ కలిస్తే అధికారం కోల్పోవడం ఖాయమని వైసిపి నేతలు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సోమిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news