టీడీపీలోకి వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో విధంగా మారుతూ షాక్ ఇస్తున్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా సోమిరెడ్డి తెలియచేయడం విశేషం… పైగా అయన చేరుతారు అన్న నమ్మకం కూడా మాకుందని ఈయన తెలిపారు. కాగా వెంటనే ఈ వ్యాఖ్యలపై ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సోమిరెడ్డి కామెంట్స్ నేను పూర్తిగా ఖండిస్తున్నా.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ మైండ్ పాలిటిక్స్ ఆడదానికి ప్రయత్నిస్తోందని.. అందుకే ఇలా తప్పుడు ప్రచఫ్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.

నన్ను ఎవరూ సంప్రదించలేదు… అంటూ ఖరాఖంఢీగా చెప్పేశాడు. దీనితో సోమిరెడ్డిపై ప్రజలు విమర్శలు మొదలుపెట్టారు. ఇక ఈ కామెంట్స్ పై మిగతా స్థానిక వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news