‘అన్‌స్టాపబుల్‌’పై వైసీపీ నాన్‌స్టాప్..రివర్స్ ఎటాక్?

-

తెలుగు సినీ రంగంలో అగ్రహీరోల్లో ఒకరిగా ఉంటూ…తనకంటూ బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకుని..60 వయసుల్లో కూడా అదరగొడుతున్న నందమూరి బాలకృష్ణ..టాక్ షోల్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆహా ఓ‌టి‌టి ప్లాట్‌ఫామ్‌లో ‘అన్‌స్టాపబుల్‌’ టాక్ షోతో బాలయ్య ఫస్ట్ సీజన్ అదరగొట్టేశారు. ఈ షో దేశంలోనే టాప్ షోగా సక్సెస్ సాధించింది.

అలా సక్సెస్ సాధించిన ఈ షో సెకండ్ సీజన్ కూడా మొదలు కానుంది. అయితే సెకండ్ సీజన్‌లో ఫస్ట్ గెస్ట్‌గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. చంద్రబాబు..బాలయ్యకు బావ ప్లస్ వియ్యంకుడు కూడా అనే సంగతి తెలిసిందే. ఇక బాబుతో పాటు లోకేష్ కూడా తన మేనమామ షోలో హల్చల్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రాగా, ఈ ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది.

అయితే ప్రోమోలో 1995లో ఎన్టీఆర్‌ని సీఎం పీఠం నుంచి గద్దె దింపిన అంశానికి సంబధించిన పార్ట్ కూడా ఉంది. అప్పుడు లక్ష్మీపార్వతిని పక్కన పెట్టాలని ఎన్టీఆర్ కాళ్ళు కూడా పట్టుకున్నట్లు బాబు చెబుతున్నట్లు ప్రోమోలో కనిపించింది. ఆ ఎపిసోడ్ గురించి బాబు కూడా అప్పుడు చేసింది రైట్? రాంగ్? అని బాలయ్యని ప్రశ్నించారు.

ఇక ‘అన్‌స్టాపబుల్‌’ షో ప్రోమో గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బాబు-బాలయ్య కాంబినేషన్ ఇది అసలైన మజా అని, వెన్నుపోటు అని విమర్శించే వారికి ఈ షో ద్వారా గట్టిగా బుద్ధి చెబుతారని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు బాబు చెప్పేవి అబద్దాలు అని, ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి మానసికంగా చంద్రబాబు హత్య చేశారు.. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూకు బాలకృష్ణ ఆహ్వానించారని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నైజం కాళ్లు పట్టుకొని లాగేయటమేనని..లక్ష్మీపార్వతిని పక్కన పెట్టండి మీరు ముఖ్యమంత్రి అవుతారానడం అబద్దమన్నారు. అలాగే బాలయ్య…బాబుని కాకుండా లక్ష్మీ పార్వతిని పిలవాలని అసలు నిజాలు తెలుస్తాయని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి అన్‌స్టాపబుల్ షోపై వైసీపీ నాన్ స్టాప్‌గా విరుచుకుపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news