వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. 9 నెలలు అయింది.. సూపర్ సిక్స్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదని…. అసెంబ్లీ కి రావాలా వద్దా అనేదని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు బొత్స సత్యనారాయణ.

ఇది ఇలా ఉండగా… అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ.